News July 31, 2024

50 మంది రష్యన్ ఫైటర్ల ఊచకోత

image

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రష్యా కిరాయి సైన్యాన్ని అక్కడి తిరుగుబాటుదారులు కిరాతకంగా చంపారు. వాగ్నర్ గ్రూప్‌కు చెందిన 50మందిని చంపేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ ఇచ్చిన సమాచారంతోనే రెబల్స్ ఈ దాడి చేసినట్లు తెలిపింది. పట్టుబడ్డ 15 మంది ఫైటర్లను ఉక్రెయిన్‌కు అప్పగించనున్నారట. ఉక్రెయిన్‌‌తో రష్యా చేస్తున్న యుద్ధంలోనూ ఈ కిరాయి సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది.

Similar News

News November 19, 2025

బొప్పాయి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

బొప్పాయిని నాటిన 9వ నెల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. రైతులు బొప్పాయి రకం, వాటిని పంపే మార్గెట్ దూరాన్ని బట్టి కాయలను కోస్తూ ఉంటారు. అయితే పంటలో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వాటిని కోయాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి.. చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. కాయలను పూర్తిగా చెట్లపై పండనీయకూడదు.

News November 19, 2025

నల్గొండ: నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోలు షురూ

image

జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బందును విరమించాయి. సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిన్నింగ్ మిల్లులు మంగళవారం బంద్ పాటించాయి. దీంతో రంగంలోకి దిగిన సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులను 2, 3 రోజుల్లో తెరుస్తామని హామీ ఇవ్వడంతో మిల్లుల యజమానులు బంద్ ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు చేయనున్నారు.

News November 19, 2025

హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

image

ఛత్తీస్‌‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.