News April 13, 2025
భారీ అగ్నిప్రమాదం.. మృతులు వీరే

AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలో జరిగిన <<16086158>>అగ్నిప్రమాదంలో<<>> 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతులను అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవింద్ (45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల (38), పురం పాప (40), గుంపిన వేణుబాబు (40), సేనాపతి బాబురావు (56), మనోహర్గా పోలీసులు గుర్తించారు.
Similar News
News April 25, 2025
BRS సభకు వెళ్లకండి: RTC జేఏసీ

TG: తమ హయాంలో RTC కార్మికులకు అన్యాయం చేసిన BRS ఇప్పుడు వారిని పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తోందని RTC జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఫైరయ్యారు. కార్మికులు 55రోజులు సమ్మె చేస్తే 34మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. 10ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగే BRS సభకు కార్మికులెవరూ వెళ్లొద్దని జేఎసీ నేతలు సూచించారు.
News April 25, 2025
బెట్టింగ్ యాప్లపై విచారణ.. మెట్రో ఎండీకి నోటీసులు

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బెట్టింగ్ యాప్లను నిషేధించినా మెట్రో రైళ్లలో ప్రకటనలు రావడంపై కోర్టు మండిపడింది. ఆ ప్రకటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
News April 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.