News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.
Similar News
News January 21, 2026
25న రథ సప్తమి.. ఆ దర్శనాలన్నీ రద్దు!

AP: తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమిని వైభవంగా నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఆర్జిత సేవలు, NRI, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించింది.
News January 21, 2026
ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్న చాహల్, మహ్వాశ్!

భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత IND క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రేడియో జాకీ, ఇన్ఫ్లుయెన్సర్ RJ మహ్వాశ్తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే SMలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని సమాచారం. పలుమార్లు వీరిద్దరూ కలిసి కనిపించడం, IPL మ్యాచుల వేళ గ్రౌండ్లో చాహల్ను ఆమె ఎంకరేజ్ చేయడంతో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
News January 21, 2026
రాజాసాబ్ ఫెయిల్యూర్కి అదే కారణం: తమ్మారెడ్డి

ప్రభాస్ ‘రాజాసాబ్’ను రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్గా తీసుంటే లాభాలు వచ్చేవని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ‘ఈ మూవీని తొలుత తక్కువ బడ్జెట్లో తెలుగులో తీయాలనుకున్నారు. తర్వాత పాన్ ఇండియా ఆలోచనతో పదే పదే స్క్రిప్ట్ మార్చారు. దీంతో మొదట అసలు కథ తెరకెక్కలేదు. మేకర్స్కు పాన్ ఇండియా ఆలోచన వస్తే చేసే మార్పులు కొన్నిసార్లే సక్సెస్ ఇస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.


