News February 16, 2025
మస్తాన్ సాయి కేసు.. గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ

AP: <<15471142>>మస్తాన్సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.
Similar News
News April 15, 2026
ముసలావిడే కానీ మహానుభావురాలు!

40ఏళ్లు దాటేసరికే జీవితం అయిపోయిందని చాలా మంది నిరుత్సాహపడుతున్న రోజులివి. కానీ కొత్త గమ్యాలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రభావతి భగవతి అనే 98ఏళ్ల బామ్మ. 2017లో భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని జయించేందుకు ఇతరుల ప్రోత్సాహంతో 2018లో ‘నానీస్ నాశ్తా’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200కుపైగా కుటుంబాలకు గుజరాతీ, మహారాష్ట్ర వంటకాలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News April 15, 2026
CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు <<-1>>వెబ్సైట్లో<<>> రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
News April 15, 2026
CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు <<-1>>వెబ్సైట్లో<<>> రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.


