News March 16, 2025
నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
Similar News
News November 25, 2025
కరీంనగర్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

KNR జిల్లాలోని 316 పంచాయతీలకు ఎన్నికలను 3 దశలో నిర్వహించనున్నారు. మొదటి దశలో రామడుగు, చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, KNR రూరల్ మండలాల్లోని 92 పంచాయతీలకు నిర్వహించనున్నారు. రెండోదశలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 113 పంచాయతీలకు జరగనున్నాయి. మూడో దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లోని 111 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
News November 25, 2025
మున్సిపల్ వాటర్తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.
News November 25, 2025
T20 WC: గ్రూపుల వారీగా జట్లు

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్తో, 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో భారత్ ఆడనుంది.


