News March 16, 2025
నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
Similar News
News April 19, 2025
IPL: టాస్ గెలిచిన గుజరాత్

అహ్మదాబాద్లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్
News April 19, 2025
అప్పుడూ.. ఇప్పుడూ ఒకే స్కోరు, ఒకే రిజల్ట్

చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్తో మ్యాచులో RCB ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది.
News April 19, 2025
నేటి నుంచి 10 రోజులు..

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.