News December 20, 2024

తన తల్లిలా మరెవరూ చనిపోవద్దని..!

image

ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో కరీముల్ హక్ అనే పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన కార్మికుడు తన తల్లిని కోల్పోయాడు. దీంతో తన తల్లికి జరిగినట్లు మరెవరికీ అవ్వొద్దని ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైక్‌ను అంబులెన్సుగా మార్చుకుని స్వగ్రామం ధలాబరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తక్షణ సేవలు అందిస్తూ 7వేల కంటే ఎక్కువ మందిని ఆయన కాపాడారు. ఆయనకు 2017లో పద్మశ్రీ వరించింది.

Similar News

News January 13, 2025

కౌశిక్ అరెస్ట్.. కరీంనగర్‌కు బీఆర్ఎస్ లీగల్ టీమ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 132, 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు తరలిస్తున్న ఆయనను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ లీగల్ టీమ్‌ కూడా కరీంనగర్ బయల్దేరింది.

News January 13, 2025

49 ఏళ్ల నటితో డేటింగ్ వార్తలు.. సింగర్ స్పందన ఇదే

image

ప్రముఖ నటి అమీషా పటేల్(49) పలు బ్రేకప్‌ల తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. ఆమె ఇటీవల తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ దుబాయ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. ఆ రూమర్లను తాజాగా నిర్వాన్ ఖండించారు. ‘అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఆమె తెలుసు. మ్యూజిక్ ఆల్బమ్ కోసం మేం దుబాయ్ వెళ్లాం’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్

image

మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.