News December 7, 2024
మాయలఫకీర్లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.
Similar News
News November 5, 2025
ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.
News November 5, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
News November 5, 2025
రెండు రోజులు జూ.పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: జూ.పంచాయతీ కార్యదర్శుల ఎంపికలో భాగంగా 2 రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. 2019లో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మంది ధ్రువపత్రాలను ఈ నెల 10, 11 తేదీల్లో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు పరిశీలించనున్నట్లు తెలిపింది.


