News December 7, 2024

మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

image

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.

Similar News

News January 24, 2025

దోచుకున్న సొమ్ము బయటపెట్టు: సోమిరెడ్డి

image

AP: విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు <<15247358>>రాజకీయాల<<>> నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘2004-09 వరకు జగన్‌ను ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. అప్పుడు దోచుకున్న రూ.43వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని ట్వీట్ చేశారు.

News January 24, 2025

ఏపీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్.. ఎక్కడంటే?

image

ఏపీలోని భీమవరంలో ఈనెల 26న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరగనుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.230కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేశ్ హీరోగా నటించగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

News January 24, 2025

రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.