News April 25, 2024

‘పది రోజుల్లో MBA’.. యూజీసీ వార్నింగ్

image

ఆన్‌లైన్‌లో నకిలీ డిగ్రీ కోర్సుల పట్ల యూజీసీ హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థుల్ని ఆకట్టుకునేందుకు ‘పది రోజుల్లో MBA’ వంటి కోర్సుల పేర్లతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, కోర్సులు అందిస్తామంటూ కొన్ని సంస్థలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర లేదా రాష్ట్ర, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థలకు మాత్రమే డిగ్రీ ప్రదానం చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.

Similar News

News January 24, 2025

ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్.. భారత్ నుంచి ముగ్గురు

image

టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. జట్టు: కమిన్స్, జైస్వాల్, బెన్ డకెట్, విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్, జడేజా, హెన్రీ, బుమ్రా.

News January 24, 2025

CID చేతికి కిడ్నీ రాకెట్ కేసు: మంత్రి దామోదర

image

TG: హైదరాబాద్‌లోని అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలు వసూలు చేశారని సమాచారం.

News January 24, 2025

పదే పదే వేడి చేసిన టీ తాగుతున్నారా?

image

చాలా మంది తమ రోజును టీతో ప్రారంభిస్తారు. కానీ పదే పదే వేడి చేసిన టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ టీలో రుచి మారి పోషకాలు తగ్గిపోతాయి. చాలాసేపు ఉడికించిన టీ తాగడం వల్ల కడుపు నొప్పి, పొత్తి కడుపువాపు రావచ్చు. చర్మంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడి శరీర ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. టీ కాచిన 15 నిమిషాల్లోగా తాగడం ఉత్తమం.