News March 18, 2024
MBNR: ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..

నిన్న మొన్నటి వరకు ఎండల వేడి నీతో ఇబ్బందులు పడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సోమవారం కాస్త ఉపశమనం లభించింది. నిన్నటి వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుతం కూల్గా ఉంది.
Similar News
News October 25, 2025
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం హన్వాడ మండలంలో కెజీబీవీని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో కెజీబీవీని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో విద్యా బోధన, భోజనం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News October 25, 2025
కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.
News October 25, 2025
జడ్చర్ల: ఎమ్మెల్యే సోదరుడిపై వేటు?

జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య 4 రోజుల క్రితం ప్రకటన విడుదల చేశారు. ఆయనను ‘దొంగ’గా సంబోధించడంపై కృష్ణయ్య ఆగ్రహించారు. అయితే, మండల అధ్యక్షుడు జిల్లా స్థాయి నాయకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని DCC నాయకులు అంటున్నారు. ఈ ఘటన పాలమూరు కాంగ్రెస్లో విభేదాలను తీవ్రతరం చేసింది.


