News August 17, 2024
కోల్కతా ట్రైనీ డాక్టర్ రాసిన మందుల చీటీ

కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. తాజాగా ఆమె రాసిన ప్రిస్క్రిప్షన్ బయటకు వచ్చింది. ఊపిరితిత్తుల విభాగానికి చెందిన ఆమె చక్కటి చేతిరాతతో రోగికి మందులు రాశారు. చాలా మంది డాక్టర్లు రాస్తే అర్థం కాదని, ఇంత క్లియర్గా ఉన్న చీటీని చూడటం ఇదే తొలిసారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేశం మంచి వైద్యురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 8, 2026
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.
News January 8, 2026
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.
News January 8, 2026
కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.


