News July 7, 2024
సీఎంల భేటీ మంచి ముందడుగు: వెంకయ్యనాయుడు

ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి ముందడుగని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి పలు అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 16, 2025
భారీ IPOలకు సూపర్ స్పందన

ఈ ఏడాది భారీ IPOలపై మదుపర్లు ఆసక్తి కనబరిచారు. ₹5,000Crకు పైగా విలువ ఉన్న IPOలకు సగటున 17.7 రెట్ల అధిక స్పందన లభించింది. 2021 తర్వాత ఇదే అత్యధికం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 IPOలు ₹1.29L Cr సమీకరించగా, అందులో ఆరు సంస్థలు ₹62,000Cr దక్కించుకున్నాయి. వీటిలో LG ఎలక్ట్రానిక్స్(38.17 రెట్లు), లెన్స్కార్ట్(28.35రెట్లు), గ్రో(17.6రెట్లు), హెక్జావేర్ (2.27రెట్లు), టాటా క్యాపిటల్ (1.96రెట్లు) ఉన్నాయి.
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 16, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ


