News March 18, 2024

పాకిస్థాన్‌లోనూ ప్రధాని మోదీ పేరుతో మెసేజ్‌లు

image

ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?

Similar News

News July 5, 2025

మనోళ్ల తెలివితో విదేశాలు అభివృద్ధి!

image

IIT గ్రాడ్యుయేట్లలో 35% మంది విదేశాల్లో సెటిల్ అవుతున్నారని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం మిగిలిన 65% మందిలో అధికులు మన దేశంలోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి MNC కంపెనీల్లో పనిచేస్తున్నారు. అలాగే టాప్-100 JEE ర్యాంకులు సాధించిన వారిలో 62మంది అమెరికా/యూరప్‌లో సెటిల్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. కానీ 2-3% మంది మాత్రమే DRDO, ISRO, BARC వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నారు.

News July 5, 2025

వెంకీ మామకు జోడీగా అందాల ‘నిధి’?

image

త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో ఒక హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఖరారైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ మూవీకి ‘వెంకట రమణ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టు తర్వాత NTRతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నారు.

News July 5, 2025

పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: CM

image

TG: పిల్లలు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ అన్నారు. HYDలో పోక్సో చట్టంపై జరిగిన స్టేట్ లెవెల్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. SMను దుర్వినియోగం చేస్తూ పిల్లలు, మహిళలపై దుర్మార్గంగా వ్యవహరించే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.