News March 18, 2024
పాకిస్థాన్లోనూ ప్రధాని మోదీ పేరుతో మెసేజ్లు

ఇండియాలో ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్లో ‘వికసిత్ భారత్’ మెసేజ్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్లోనూ చాలామందికి ఈ మెసేజ్ వస్తున్నాయట. పాక్తో పాటు దుబాయ్లో ఉంటున్న వారి ఫోన్లకు సైతం ఈ మెసేజ్ వచ్చినట్లు వారు చెబుతున్నారు. దుబాయ్లో ఉంటున్న పాకిస్థాన్ జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
Similar News
News September 7, 2025
రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి

TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.
News September 7, 2025
క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా

Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్యశాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.
News September 7, 2025
మంత్రి లోకేశ్పై అంబటి సెటైర్లు

AP: పలువురు లిక్కర్ కేసు నిందితులు బెయిల్పై విడుదలవ్వడంపై YCP నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేసి సెటైర్లు వేశారు.