News November 20, 2024
భారత్లో ఫుట్బాల్ మ్యాచ్కు మెస్సీ?

2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ 2 మ్యాచ్లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్బాల్కు క్రేజ్ ఎక్కువ. భారత్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.
Similar News
News March 11, 2026
NLC ఇండియా లిమిటెడ్లో 16 పోస్టులు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ 16 హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్స్పెక్టర్)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.
News March 11, 2026
ఉక్రెయిన్ ఆఫర్కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్ను ఆశ్రయిస్తోంది.
News March 11, 2026
‘టీ’తో హెల్తీ కాంబినేషన్స్ ఇవే..

టీ తాగేటప్పుడు బిస్కెట్లు, రస్క్లు, ఫ్రైడ్ స్నాక్స్ తింటుంటారు. కానీ వీటి వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరగడం, డయాబెటిస్ వంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి బదులు వేయించిన శనగలు, పల్లీలు, నట్స్, డ్రైఫ్రూట్స్, మఖానా వంటి ఫైబర్, ప్రొటీన్ రిచ్ స్నాక్స్ తీసుకుంటే బెటర్. టీ తాగిన తర్వాత లేదా ముందు ఫ్రూట్స్, స్ప్రౌట్స్, పనీర్ క్యూబ్స్ తిన్నా మంచిదే.


