News February 1, 2025

మధ్యతరగతి ప్రజలు మోదీ గుండెల్లో ఉంటారు: అమిత్ షా

image

మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీ గుండెల్లో ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విటర్లో పేర్కొన్నారు. రూ.12 లక్షల ఆదాయం వరకూ ఆదాయపు పన్ను కట్టనవసరం లేకపోవడం వారందరికీ ఊరటనిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ‘మధ్యతరగతి ప్రజల ఆర్థిక సంక్షేమం మరింత పదిలమయ్యేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. ఈ చర్యతో లబ్ధి పొందేవారందరికీ కంగ్రాట్యులేషన్స్’ అని తెలిపారు.

Similar News

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు

News July 11, 2025

రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.

News July 11, 2025

మూవీ ముచ్చట్లు

image

* ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ సిట్టింగ్స్.. తమన్‌తో ప్రభాస్
* ఓటీటీలోకి వచ్చేసిన ‘8 వసంతాలు’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
* సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కలియుగం 2064
* సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’
* ఇవాళ థియేటర్లలోకి ‘ఓ భామ అయ్యో రామ’, ‘సూపర్ మ్యాన్’ సినిమాలు
* కార్తీ కొత్త మూవీ ‘మార్షల్’
* సోనీలివ్‌లో యాక్షన్ డ్రామా మూవీ ‘నరివెట్ట’ స్ట్రీమింగ్