News September 25, 2024

మంత్రులు జూపల్లి, ఉత్తమ్‌కు చేదు అనుభవం

image

TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు మంత్రులు వెళ్లగా నిర్వాసితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భూ నిర్వాసితులపై మండిపడ్డారు.

Similar News

News January 7, 2026

TU: ‘వన్ టైమ్ ఛాన్స్’ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సీఓఈ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016-2020 మధ్య చేరిన బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ, బి.బి.ఏ విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో ఈనెల 27 వరకు అవకాశం ఉందన్నారు. ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 7, 2026

TU: ‘వన్ టైమ్ ఛాన్స్’ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్’ ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సీఓఈ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016-2020 మధ్య చేరిన బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ, బి.బి.ఏ విద్యార్థులు తమ పెండింగ్ సెమిస్టర్ల (1 నుంచి 6 వరకు) పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో ఈనెల 27 వరకు అవకాశం ఉందన్నారు. ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 7, 2026

SVU స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

image

తిరుపతి SVU స్నాతకోత్సవానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2018 నుంచి 2024 వరకు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 63 నుంచి 68వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు www.svuexams.com ద్వారా దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో సమర్పించాలి. స్నాతకోత్సవం విద్యార్థుల ఎదురుచూపులని ఇటీవల Way2Newsలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.