News January 9, 2025

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు

image

AP: తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తారు.

Similar News

News January 15, 2025

ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం

image

ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.

News January 15, 2025

హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!

image

తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్‌నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్‌లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.

News January 15, 2025

Stock Markets: మెటల్, PSU బ్యాంకు షేర్లకు గిరాకీ

image

మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,202 (+25), సెన్సెక్స్ 76,649 (+150) వద్ద ట్రేడవుతున్నాయి. సెక్టోరల్ ఇండైసెస్ మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, PSU BANK, ఆటో, O&G షేర్లకు డిమాండ్ ఉంది. FMCG, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. NTPC, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ADANI SEZ టాప్ గెయినర్స్. BAJAJ TWINS టాప్ లూజర్స్.