News December 7, 2024
అవుట్ కాకపోయినా వెళ్లిపోయిన మిచెల్ మార్ష్!
అడిలైడ్ టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అశ్విన్ బౌలింగ్లో మార్ష్ డిఫెండ్ చేసేందుకు యత్నించగా బంతి బ్యాట్ను తాకుతున్నట్లుగా వెళ్లి పంత్ చేతిలో పడింది. భారత్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చేశారు. మార్ష్ కూడా సైలెంట్గా పెవిలియన్కు వెళ్లిపోయారు. తీరా రీప్లేలో చూస్తే బంతి బ్యాట్కు తగలనేలేదని తేలింది. బ్యాట్ తన ప్యాడ్కు తాకగా బంతికి తాకినట్లు మార్ష్ భావించి వెళ్లిపోయారు.
Similar News
News January 23, 2025
ఎయిర్పోర్టులో ఇంత తక్కువ ధరలా!
విమానాశ్రయాల్లోని కేఫ్లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్కతాలోని కేఫ్లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో సమస్యను లేవనెత్తారు.
News January 23, 2025
హైదరాబాద్లో ఇన్ఫోసిస్ విస్తరణ
హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.
News January 23, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్గా వరుణ్ తేజ్ అంటూ ప్రచారం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ రెడీ చేశారని, వరుణ్కు తన క్యారెక్టర్ గురించి వివరించారని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.