News February 26, 2025
MLC ఎన్నికకు 233 మంది పోలీస్ బందోబస్త్: ఎస్పీ

జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం జరగనుండగా.. 233 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పర్యటిస్తారన్నారు.
Similar News
News February 26, 2025
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
News February 26, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోర్ చేసిన అఫ్గాన్

ఇంగ్లండ్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
News February 26, 2025
నార్త్ కొరియాలోకి విదేశీ పర్యాటకులకు అనుమతి?

ఐదేళ్ల తర్వాత నార్త్ కొరియా తమ దేశంలోకి విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. పర్యాటకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ మారక నిల్వలపై దృష్టి పెడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఆ దేశం విదేశీ పర్యాటకులపై నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.