News March 4, 2025

MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

image

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్‌ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Similar News

News March 4, 2025

Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

image

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్‌కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.

News March 4, 2025

శ్రీవారి ఆలయాలకు ఫ్రీగా స్థలం కేటాయించండి: TTD ఛైర్మన్

image

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని TTD ఛైర్మన్ BR నాయుడు కోరారు. CM చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు పలు రాష్ట్రాల CMలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని చెప్పారు.

News March 4, 2025

15 కేజీల బంగారంతో పట్టుబడ్డ నటి

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాన్యా రావ్ DRI అధికారులకు పట్టుబడ్డారు. రాన్య 15రోజుల్లో 4సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు రాగానే ఆమెను విచారించారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని తెలిపారు. తాను మాజీ DGP రామచంద్రరావు కూతురినని ఆమె చెప్పారన్నారు.

error: Content is protected !!