News February 13, 2025

MNCL: జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులు

image

జాతీయ ఉపకార వేతనాలకు(NMMS) జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని HM రాజన్న తెలిపారు. ఈ 11 మంది విద్యార్థులకు ఏటా రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్కాలర్షిప్ పరీక్షల్లో విజయం సాధించిన 11 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News February 13, 2025

దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

News February 13, 2025

సీఎం రేవంత్‌ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

image

TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

News February 13, 2025

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!