News April 6, 2024
మోదీ 3.0.. బడా నిర్ణయాలకు ప్లానింగ్ షురూ? – 1/2

ప్రధాని మోదీ మరోసారి ఎన్నికైతే తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారట. 2030 నాటికి వృద్ధులకు పెన్షన్ 50% పెంపు, ఉద్యోగాల్లో మహిళలకు 50% భాగస్వామ్యం దక్కేలా చర్యలు, ఈవీ సేల్స్ 30%కు పెంచడం మొదలైనవి ప్లాన్ చేస్తున్నారట. మినిస్ట్రీలను కుదించడం, విదేశాల్లో దౌత్య కార్యాలయాల విస్తరణ, ప్రైవేటు పెట్టుబడుల పెంపు, కీలక ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అంశాలు సైతం పరిశీలిస్తున్నారట.
Similar News
News April 19, 2026
RTC ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుందా?

TG: ఈ నెల 22 నుంచి RTC ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో జీతాల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021, 2025 వేతన సవరణలు పెండింగ్లో ఉండగా, ఒక విడత వేతన సవరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 లేదా 8% ఫిట్మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక నేతలతో చర్చించి ఫిట్మెంట్ను 10% మించకుండా ఖరారు చేసే ఛాన్సుందని, మరో వేతన సవరణపైనా హామీ ఉండొచ్చని సమాచారం.
News April 19, 2026
RRR నిర్మాణం.. ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr పరిహారం!

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి(D) సదాశివపేట(M) పెద్దాపూర్ పరిధిలోని భూములకు ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr, కనిష్ఠంగా దౌల్తాబాద్ శివారు భూములకు ఎకరానికి ₹16L ఇస్తున్నట్లు సమాచారం. RRR కోసం సంగారెడ్డి CALA పరిధిలో 526 ఎకరాలు అవసరమని NHAI నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వాసితులకు ₹119.50Cr చెల్లించారు.
News April 19, 2026
అప్పులపై రాజధాని.. అలాగే మావిగన్ సరికాదు: విజయసాయిరెడ్డి

AP: రాష్ట్రానికి క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమని YCP మాజీ MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘రూ.లక్షల కోట్లతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై రాజధాని నమూనా సరికాదు. ఏకీకృత, దశలవారీ అభివృద్ధితో నిర్మించాలి. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని అనేది పరిపాలనకు నాడీకేంద్రంగా ఉండాలి. మావిగన్ అంటూ పరిపాలనా విభజన ప్రమాదం. దీంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది’ అని అన్నారు.


