News April 22, 2024

దేశ సమస్యలపై మోదీ మాట్లాడట్లేదు: శరద్ పవార్

image

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కేవలం కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారని, దేశ సమస్యలపై మాట్లాడటం లేదని NCP-SP చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. గతంలో ప్రధానులు దేశ భవిష్యత్తుపై తమ విజన్ గురించి చెప్పేవారని గుర్తు చేశారు. మోదీ మాత్రం ప్రజల్ని ప్రభావితం చేసేందుకు విపక్షాలపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని విమర్శించారు. దేశ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకోవట్లేదన్నారు.

Similar News

News March 4, 2026

జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

image

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.

News March 4, 2026

శ్రీకాకుళం జిల్లాలో 13 ఉద్యోగాలు

image

శ్రీకాకుళం జిల్లా స్త్రీ&శిశు సంక్షేమం శాఖ, వన్ స్టాప్ సెంటర్‌లో 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: srikakulam.ap.gov.in/

News March 4, 2026

దివ్యాంగులకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం.. TG ప్రభుత్వం క్లారిటీ

image

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో TGSRTC బస్సుల్లోనూ దివ్యాంగులందరికీ పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని TG ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందని తెలిపింది.