News November 16, 2024

‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

image

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.

Similar News

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

image

ఉద్యోగ మార్కెట్‌పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్‌ఎంప్లాయిమెంట్‌ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్‌కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.