News December 6, 2024
మోదీ.. భూటాన్ రాజు.. చికెన్ నెక్..
భూటాన్ రాజు జిగ్మే కేసర్కు PM మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 2024లో వీరు 4 సార్లు కలిశారు. రెండో టర్ములో ఆఖరి, మూడో టర్ములో మోదీ తొలి పర్యటన భూటాన్లోనే కావడం విశేషం. పొరుగుదేశాలతో సహకారం గురించి చర్చిస్తున్నారని చెప్తున్నా మరేదో సీక్రెట్ మిషన్ ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కీలకమైన సిలిగుడి కారిడార్ ‘చికెన్ నెక్’ను విస్తరించి ‘గోట్ నెక్’గా మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
Similar News
News January 22, 2025
నిజమైన ప్రేమ దొరకడం కష్టమే: చాహల్
తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల రూమర్ల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘నిజమైన ప్రేమ చాలా అరుదు.. నా పేరు కూడా అలాంటిదే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్, పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి చాహల్ను ఎంపిక చేయలేదు. దీంతో BCCIపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
News January 22, 2025
దావోస్లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.
News January 22, 2025
విజయ పరంపర కొనసాగుతుందా?
ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.