News September 15, 2024
ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
Similar News
News July 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 10, 2025
‘X’ CEO పదవికి లిండా రాజీనామా

ప్రముఖ SM యాప్ ‘X’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘రెండు అద్భుతమైన సంవత్సరాల తర్వాత నేను CEO హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కమ్యూనిటీ నోట్స్ ఆవిష్కరణల నుంచి, త్వరలో ప్రారంభంకానున్న X మనీ వరకు ఈ బృందం కృషి ఎంతో గొప్పది’ అని ట్వీట్ చేశారు. లిండా రాజీనామాపై ఎలాన్ మస్క్ ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ స్పందించారు.
News July 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 10, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.