News April 10, 2024
త్వరలో మోదీ-మస్క్ భేటీ?

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈనెల 22న ప్రధాని మోదీతో మస్క్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం భారత్లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై మస్క్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందట. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చివరగా మోదీ-మస్క్ గతేడాది జూన్లో కలిశారు. మరోవైపు మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్స్ట్రువల్ కప్తో ఎన్నో లాభాలు

ఒక మెన్స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్స్ట్రువల్ కప్తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.


