News April 10, 2024
త్వరలో మోదీ-మస్క్ భేటీ?

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈనెల 22న ప్రధాని మోదీతో మస్క్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం భారత్లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ స్థాపనపై మస్క్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందట. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చివరగా మోదీ-మస్క్ గతేడాది జూన్లో కలిశారు. మరోవైపు మహారాష్ట్రలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Similar News
News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
News March 19, 2025
ఐమాక్స్ ఫార్మాట్లో.. మోహన్ లాల్ చిత్రం

మోహన్లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.
News March 19, 2025
సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్లోని ఝాలసన్లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.