News September 29, 2024

తెలంగాణపై మోదీ ప్రశంసలు

image

తెలంగాణ ప్రజలపై 114వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు. దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు.

Similar News

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

News November 22, 2025

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.