News February 26, 2025
మహిళలకు మోదీ సోషల్ మీడియా అకౌంట్స్!

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఆయనకు సోషల్ మీడియాలోనూ కోట్లాది మంది ఫాలోవర్లున్నారు. ఇన్స్టాలో 92.3 మిలియన్లు, ఫేస్బుక్లో 50 మిలియన్లు, Xలో 105.5 మిలియన్ల ఫాలోవర్లు ఆయన సొంతం. అలాంటి అకౌంట్స్ ఒక్కరోజు మీ సొంతమైతే ఏం చేస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు ఈ ఖాతాలు అందించనున్నారు. వారి అనుభవాలను ఇందులో పంచుకుంటారు.
Similar News
News November 25, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలపై పార్టీల ఫోకస్!

జిల్లాలో 248 పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్నప్పటికీ, తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందేలా ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ పోరును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థులపై నియోజకవర్గ స్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు.
News November 25, 2025
ఇవాళ ఉదయం 10 గంటలకు

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 25, 2025
‘MTU 1426’ వరి వంగడం ప్రత్యేకతలు

‘MTU 1426’ వరి వంగడాన్ని MTU 1121, NLR 34449 రకాలను సంకరం చేసి అభివృద్ధి చేశారు. బియ్యం పారదర్శకంగా, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకానికి గింజ రాలడం బాగా తక్కువ. గింజలు చేనుపై మొలకెత్తవు. అన్నం మృదువుగా ఉండి తినడానికి అత్యంత అనుకూలం. అగ్గితెగులు, ఎండాకు తెగులు, ఉల్లికోడును కొంత మేర తట్టుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.


