News August 8, 2024
ఎల్లుండి వయనాడ్కు మోదీ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న వయనాడ్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కన్నూర్ వెళ్లనున్న ఆయన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. అనంతరం ఈ ఘటనతో నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News January 20, 2026
22 వేల పోస్టులు.. దరఖాస్తుల తేదీలివే!

22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి ఈ నెల 30న RRB పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 21 నుంచి కాకుండా 31వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మార్చి 2 వరకు గడువు విధించనుంది. టెన్త్, ITI అర్హత కలిగిన, 18-33 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం ₹18,000 చెల్లిస్తారు.
వెబ్సైట్: www.rrbchennai.gov.in/
News January 20, 2026
40 ఏళ్లు వచ్చాయా.. లేఆఫ్స్ ముప్పు!

ఉద్యోగికి 40 ఏళ్లు వచ్చాయంటే కెరీర్లో ముఖ్యమైన దశలో ఉన్నారని అర్థం. వీరి 15 ఏళ్ల అనుభవం, నైపుణ్యంతో కంపెనీకి అసెట్గా భావిస్తారు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ లేఆఫ్స్ ఎఫెక్ట్ ఈ ఏజ్ ఉద్యోగులపైనే పడుతోంది. ప్రమోషన్లు ఉండటం లేదు. జాబ్ మారుదామంటే ‘మీరు ఓవర్ క్వాలిఫైడ్. ఫ్రెషర్స్, చురుకైన వారు కావాలి’ అని రిక్రూటర్లు చెబుతున్నారు. తక్కువ జీతాలకు ఫ్రెషర్లు దొరకడం కూడా వీరిని వదిలించుకోవడానికి మరో కారణం.
News January 20, 2026
హరీశ్ రావును విచారించనున్న ఆరుగురు అధికారులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. HYDలోని జూబ్లీహిల్స్ PSలో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ వెంట ఆయన న్యాయవాది రాంచందర్రావును లోనికి అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, బాధితులుగా పేర్కొన్న BJP నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ను విచారించిన సంగతి తెలిసిందే.


