News August 8, 2024
ఎల్లుండి వయనాడ్కు మోదీ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న వయనాడ్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కన్నూర్ వెళ్లనున్న ఆయన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. అనంతరం ఈ ఘటనతో నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News October 13, 2025
వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.
News October 13, 2025
ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్

EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెంబర్లు తమ అకౌంట్ నుంచి 100% డబ్బు డ్రా చేసుకొనే సదుపాయానికి ఆమోద ముద్ర వేశారు. ఎంప్లాయీతో పాటు ఎంప్లాయర్ షేర్ నుంచి 100% విత్డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల 7 కోట్ల మందికి పైగా ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అటు 13 క్లాజులను 3 విభాగాలుగా విభజించారు. విద్య, ఇల్నెస్, వివాహాన్ని ‘అవసరాలు’ కేటగిరీలోకి తీసుకొచ్చారు.
News October 13, 2025
మోదీని కలవడం గర్వంగా ఉంది: CM చంద్రబాబు

AP: ఢిల్లీలో PM మోదీతో CM చంద్రబాబు భేటీ ముగిసింది. ఆయన్ను కలవడం గౌరవంగా ఉందని CM ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పా. GST సంస్కరణల విషయంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించా. కర్నూలులో జరిగే ‘సూపర్ GST-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి ఆహ్వానించా. NOV 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకి ఇన్వైట్ చేశా’ అని వెల్లడించారు.