News January 8, 2025
నేడు విశాఖకు మోదీ.. కట్టుదిట్టమైన భద్రత
AP: ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను SPG తమ ఆధీనంలోకి తీసుకుంది. 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది IPS అధికారులు,18 మంది అడిషనల్ SPలు, 60 మంది DSPలు, 180 మంది CIలు, 400 మంది SIలు పాల్గొననున్నారు. ప్రధాని 3గంటల పాటు విశాఖలో పర్యటించనున్నారు.
Similar News
News January 20, 2025
అథ్లెట్పై లైంగిక వేధింపులు.. 57 మంది అరెస్టు
కేరళలో అథ్లెట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 57 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా అందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు సార్లు యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు విచారణలో తేలింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.
News January 20, 2025
భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్
భారత క్రికెటర్లు మ్యాచ్లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్తో తొలి టీ20 కోల్కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.
News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని రోటుండా ఇండోర్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.