News November 25, 2024

3 రోజుల్లోనే డబ్బులు జమ: మంత్రి ఉత్తమ్

image

TG: వచ్చే ఏడాది జనవరి 10 వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ సూర్యాపేటలో తెలిపారు. ఇప్పటి వరకు రూ.5,040కోట్ల విలువైన 21.73లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2,760కోట్లు చెల్లించామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా 66లక్షల ఎకరాల్లో 153 లక్షల MTల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. విక్రయించిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Similar News

News November 23, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/

News November 23, 2025

మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

image

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్‌ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.

News November 23, 2025

28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.