News January 10, 2025
అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

TG: జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నట్లు CM రేవంత్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. సాగుయోగ్యమైన ప్రతీ ఎకరాకి రైతుభరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్థిరాస్తి, లే ఔట్లు, నాలా కన్వర్షన్ అయిన, మైనింగ్, ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.
Similar News
News October 21, 2025
లక్ష్మీనాయుడు హత్యపై ప్రత్యేక ట్రిబ్యునల్తో విచారణ

AP: కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రత్యేక ట్రిబ్యునల్తో దర్యాప్తు వేగవంతం చేయాలని CM CBN ఆదేశించారు. ‘మృతుని భార్యకు, పిల్లలకు రెండేసి ఎకరాలు, ₹5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గాయపడ్డ పవన్కు 4 ఎకరాలు, ₹5 లక్షలు, భార్గవ్కు ₹3లక్షలు, ఆసుపత్రి ఖర్చు చెల్లించాలి’ అని సూచించారు. విచారణ వేగంగా జరిగేలా FAST TRACK కోర్టుకు అప్పగించాలన్నారు.
News October 21, 2025
సరెండర్కు హిడ్మా సన్నద్ధం..?

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-1 కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం. సుక్మా(CG) జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూళ్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. ఆయనను పట్టుకుంటే అడవిలో పోరాటం దాదాపు అంతం అవుతుందని కేంద్ర భావన.
News October 21, 2025
రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

రేపు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేస్తే అపమృత్యు భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేస్తే శరీరంలో మలినాలు తొలగి, సాత్వికత పెరుగుతుంది. కొత్త వస్త్రాలు ధరించి బలి చక్రవర్తిని, గోవులను పూజించి, దానాలు చేస్తే దేవుని అనుగ్రహం లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.
* ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.