News May 21, 2024

జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి రుతుపవనాలు

image

TG: నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11వ తేదీ మధ్య రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెలాఖరుకే కేరళను తాకనుండగా.. ఆక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణకు చేరుకోవడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. అంటే 5-8వ తేదీల మధ్యే వచ్చే అవకాశం ఉండగా.. కాస్త ఆలస్యమైతే 11వ తేదీలోగా రాష్ట్రమంతా విస్తరిస్తాయని భావిస్తున్నారు.

Similar News

News April 15, 2026

బాపట్ల జిల్లాకు నిధులు

image

పల్నాడు, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పల్నాడులోని 35 రోడ్లకు రూ.69.91 కోట్లు, బాపట్లలోని 44 రోడ్లకు రూ.60.61కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచింది. గత ఐదేళ్లుగా ఈ రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలకు నిధులిచ్చిన ప్రభుత్వం గుంటూరును మాత్రం విస్మరించింది.

News April 15, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

image

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్‌ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ సంతాపం వ్యక్తం చేశారు.

News April 15, 2026

డీలిమిటేషన్.. BJP ప్లాన్‌తో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి

image

డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టడంతో ప్రతిపక్షాల పరిస్థితి ‘మింగలేక కక్కలేక’ అన్నట్లుగా మారింది. వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకుల ముద్ర పడుతుందని, సమర్థిస్తే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి. మహిళా సాధికారత సెంటిమెంట్‌ను ముందుపెట్టి, సీట్లను పెంచుకొని తమకు రాజకీయంగా చెక్ పెట్టాలని BJP చూస్తోందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.