News November 27, 2024
వక్ఫ్ బిల్లుపై మరింత గడువు కావాలి: జేపీసీ

వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద సవరణల్ని పరిశీలించేందుకు 2025 బడ్జెట్ సెషన్ ముగింపు వరకు టైమ్ అడగాలని పార్లమెంటు జాయింట్ కమిటీ(JPC) నిర్ణయించింది. ఈరోజు జరిగిన జేపీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. అందుకోసం లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. వక్ఫ్ విషయంలో తమకు పలు ప్రశ్నలున్నాయని, వాటి సమాధానాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 19, 2025
లక్కీ డిప్కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


