News April 4, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. BJP నేతలు బీఎల్ సంతోష్, తుషార్లకు నోటీసులు ఇచ్చేందుకు BRS నేతకు చెందిన విమానంలో అప్పటి సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News December 18, 2025
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.
News December 18, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.
News December 18, 2025
హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి నిర్ణయం

TG: వివిధ ప్రాంతాల్లోని 339 LIG ఫ్లాట్ల(FLAT)ను విక్రయించేందుకు హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. HYD గచ్చిబౌలిలో 111, వరంగల్లో 102, ఖమ్మంలో 126 ఫ్లాట్లను అమ్మనున్నట్లు బోర్డు VC గౌతం తెలిపారు. వాటి ధరలు గచ్చిబౌలిలో ₹26L-₹36.20L, వరంగల్లో ₹19L-₹21.50L, ఖమ్మంలో ₹11.25Lగా నిర్ణయించామన్నారు. ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని, వివరాలకు https://tghb.cgg.gov.inని సందర్శించాలని సూచించారు.


