News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. BJP నేతలు బీఎల్ సంతోష్, తుషార్‌లకు నోటీసులు ఇచ్చేందుకు BRS నేతకు చెందిన విమానంలో అప్పటి సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News October 26, 2025

ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

image

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

image

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.

News October 26, 2025

‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

image

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.