News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. BJP నేతలు బీఎల్ సంతోష్, తుషార్‌లకు నోటీసులు ఇచ్చేందుకు BRS నేతకు చెందిన విమానంలో అప్పటి సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News April 17, 2026

ట్రంప్‌ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

image

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.

News April 17, 2026

ట్రంప్‌ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

image

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.

News April 17, 2026

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.