News April 24, 2024
అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోనే: యూఎన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713860643815-normal-WIFI.webp)
ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలో ఆసియా అత్యధికంగా ప్రభావితమవుతోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ(WMO) ఓ నివేదికలో తెలిపింది. తుఫాన్లు, వరదలే ఈ విపత్తుల్లో అత్యధికమని వెల్లడించింది. వీటి వలన గత ఏడాది 2వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు, కరవు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటివి కూడా ఆసియా దేశాలపై విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Similar News
News January 25, 2025
నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737774232206_782-normal-WIFI.webp)
మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’కి మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం తెలుగులోనూ రిలీజైంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ దక్కించుకున్న జీ5 జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే థియేటర్లలో రిలీజైన వారానికే OTTలోకి వస్తుండటం గమనార్హం. మూవీలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో ఇప్పటి వరకు రూ.18కోట్లకు పైగా వసూలు చేసింది.
News January 25, 2025
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737775188683_782-normal-WIFI.webp)
AP: అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతినెలా దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచంలో ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే.
News January 25, 2025
రైతు భరోసా.. వాళ్లకు గుడ్న్యూస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737761173485_782-normal-WIFI.webp)
TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్బుక్లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.