News December 17, 2024
లక్షల్లో మొక్కలు నాటిన ‘తల్లి’ మృతి

ప్రఖ్యాత పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె చనిపోయారు. కర్నాటకలోని హొన్నాలికి చెందిన ఈమె ‘మదర్ ఆఫ్ ట్రీ’గా పేరు తెచ్చుకున్నారు. 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ లక్షలాది మొక్కలను నాటారు. మొక్కల గురించి అసమానమైన పరిజ్ఞానం ఉండటంతో ఆమెను ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్’ అని పిలుస్తుంటారు.
Similar News
News December 6, 2025
వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
News December 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 88 సమాధానం

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: విష్ణువును శ్రీనివాసుడు అని పిలవడానికి ప్రధాన కారణం.. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉండటమే. ‘శ్రీ’ అంటే లక్ష్మీదేవి. ‘నివాస’ అంటే నివాసం. అలా లక్ష్మీదేవికి నిలయమైన ఆయనను శ్రీనివాసుడు అని పిలుస్తారు. ఈ పేరు భగవంతుడికి ఉన్న ప్రేమపూర్వకమైన, సంరక్షణతో కూడిన స్వభావాన్ని సూచిస్తుంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 6, 2025
జగన్కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగన్కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.


