News March 26, 2024
ఎంపీ బరిలో కుమారస్వామి

జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి స్పష్టం చేశారు. 28 ఎంపీ స్థానాలు ఉన్న కర్ణాటకలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Similar News
News March 20, 2026
చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.
News March 20, 2026
అజహరుద్దీన్ మంత్రి పదవికి డెడ్లైన్ గండం!

TG: మంత్రిగా కొనసాగుతున్న అజహరుద్దీన్కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపైనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో చూడాలి.
News March 20, 2026
SRH జట్టుకు మరో షాక్!

IPL: మొదటి కొన్ని మ్యాచ్లకు ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ దూరం కాగా SRH జట్టుకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగినట్లు Cricbuzz తెలిపింది. అయితే గాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇటీవల వేలంలో AUSకు చెందిన ఈ ప్లేయర్ను SRH రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇద్దరు పేసర్లు లేకపోవడం SRH బౌలింగ్ విభాగానికి తలనొప్పిగా మారింది.


