News April 4, 2024
ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె ‘మోచి’ కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్ను రద్దు చేయగా, ఆమె SCని ఆశ్రయించారు. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి BJP MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
Similar News
News February 8, 2026
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.
News February 8, 2026
ఇంగ్లండ్పై పోరాడి ఓడిన నేపాల్

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.
News February 8, 2026
ఆలయాలకు గోపురం ఎందుకు ఉంటుంది?

గోపురం ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక అవసరాల సమాహారం. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది దేవుని పాదాలకు సంకేతం. గుడిపై ఈ నిర్మాణం విశ్వశక్తిని గ్రహిస్తుంది. గుడికి శక్తి కేంద్రంగా నిలుస్తుంది. దేవుడే సర్వోన్నతుడని చాటుతుంది. ఎత్తుగా ఉండి బాటసారులకు దిక్సూచిగా మార్గం చూపుతుంది. పిడుగుల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. దూరం నుంచి గోపురాన్ని దర్శించినా దైవకృప లభిస్తుందని నమ్మకం. మన సంస్కృతికిది నిలువుటద్దం.


