News September 16, 2024

అమెరికాలో ఎంఎస్ ధోనీ వెకేషన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన స్నేహితులతో కలిసి అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌కు హాజరయ్యారు. ఆయన సన్నిహితుల్లో ఒకరైన హితేశ్ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మహీతో పాటు ఫెడ్‌ఎక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణియం కనిపిస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌-2025లో ధోనీ ఆడతారా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Similar News

News November 17, 2025

గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.

News November 17, 2025

గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.

News November 17, 2025

పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: పొంగులేటి

image

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు DECలనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. HC తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.