News August 19, 2024

ముడా స్కామ్: హైకోర్టును ఆశ్రయించిన సిద్దరామయ్య

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ముడా స్కామ్‌లో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతివ్వడాన్ని సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతిని బట్టి ఆయన పిటిషన్‌ను నేటి మధ్యాహ్నం లేదా మంగళవారం విచారిస్తామని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తెలిపారు. మైసూరు నగరాభివృద్ధి సంస్థలో భూకుంభకోణం జరిగిందన్న సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు.

Similar News

News December 9, 2025

2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 9, 2025

25 మంది మృతి.. థాయ్‌లాండ్‌కి పరారైన ఓనర్లు

image

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్‌ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహాయంతో వారి అరెస్ట్‌కు చర్యలు చేపట్టారు.

News December 9, 2025

నువ్వుల సాగు.. విత్తనశుద్ధి, విత్తే పద్ధతి

image

నేల నుంచి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి కార్బండిజం 2.5గ్రా. లేదా మాంకోజెబ్ 3గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడటానికి కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5ml కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తాలి. విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు.