News October 1, 2024
ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య

ముడా స్కామ్కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.
Similar News
News December 28, 2025
నెల్లూరు: మాటల్లేవ్.. నిశ్శబ్ద యుద్ధమే..!

అక్కడ పగలు, ప్రతీకారాలు లేవు. పార్టీ ఏదైనా మాటల యుద్ధాలు ఉండవు. అదే ఆత్మకూరు నియోజకవర్గం. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు మేకపాటి కుటుంబం అడ్డా. కానీ గత ఎన్నికల్లో TDP గెలిచింది. అక్కడ TDP-YCP నాయకుల మధ్య ప్రశాంతం వాతావరణం ఉంటుంది. కానీ.. ఎన్నికలంటేనే ప్రధాన పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
News December 28, 2025
దానిమ్మ తోటలపై క్రాప్ కవర్ వల్ల లాభాలేమిటి?

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.
News December 28, 2025
150 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<


