News February 5, 2025
బీసీల్లో ముదిరాజ్లు టాప్, ఆ తర్వాత యాదవులు

తెలంగాణలో కులగణన సర్వేలో 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని తేలింది. వీరిలో 26 లక్షలకు పైగా జనాభాతో ముదిరాజ్లు టాప్లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు, 16 లక్షల జనాభాతో గౌడ కులస్థులు, ఆ తర్వాత 13.70 లక్షల జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం బీసీ జనాభాలో ఈ ఐదు కులాలే సగానికి పైగా ఉన్నట్లు తేలింది.
Similar News
News March 7, 2026
చిత్తూరు: సివిల్స్కు నలుగురి ఎంపిక

పలమనేరు(M) కాప్పల్లి జరావారిపల్లెకు చెందిన రాయలం జయశ్రీ సివిల్స్లో 360వ ర్యాంకు సాధించారు. IRS వచ్చే అవకాశం ఉండగా.. IAS కోసం మరోసారి ట్రై చేస్తానంటున్నారు. TTD ఉద్యోగిని మల్లేశ్వరి కుమార్తె యారాశి తుషారికకు 393 ర్యాంకు వచ్చింది. బైరెడ్డిపల్లెకు చెందిన రంపం శ్రీకాంత్ గతేడాది 904వ ర్యాంకు, ఇప్పుడు 765వ ర్యాంకు పొందారు. నిమ్మనపల్లె(M) అగ్రహారానికి చెందిన గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు సాధించారు.
News March 7, 2026
టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

T20 WC ఫైనల్లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్లో 2023 ODI WC ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్కు మంచిదని అభిప్రాయపడ్డారు.
News March 7, 2026
కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

ఆన్లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.


