News August 5, 2024
నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు ఏం చెప్పారంటే!

ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. కాగా పలు పరిశోధనలు చేసినా ఆమె నోరు తెరిచి ఉండటానికి ఓ నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోయారు. హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోవడం, మృతదేహాన్ని భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటివి కారణాలు కావొచ్చని ఇటీవల వెల్లడించారు.
Similar News
News October 23, 2025
వేధింపులను ధైర్యంగా ఎదుర్కోండి

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
APPLY NOW: IRCTCలో 64 ఉద్యోగాలు

IRCTCలో 64 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో బీఎస్సీ/బీబీఏ/ఎంబీఏ పూర్తిచేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులు. రెండేళ్ల అనుభవం ఉండాలి. నవంబర్ 8-18 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెబ్సైట్: https://www.irctc.com/
✒ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 23, 2025
వర్షంతో ఆటకు అంతరాయం

WWC: నవీ ముంబైలో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం వల్ల ఆటంకం కలిగింది. 48 ఓవర్ల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్లకు చేరుకోగా, గ్రౌండ్ స్టాప్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోడ్రిగ్స్ 69, హర్మన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 329/2గా ఉంది. అంతకుముందు ప్రతీకా రావల్(122), స్మృతి(109) సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.