News August 5, 2024

నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు ఏం చెప్పారంటే!

image

ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. కాగా పలు పరిశోధనలు చేసినా ఆమె నోరు తెరిచి ఉండటానికి ఓ నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోయారు. హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోవడం, మృతదేహాన్ని భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటివి కారణాలు కావొచ్చని ఇటీవల వెల్లడించారు.

Similar News

News November 27, 2025

ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు

image

చొరబాటుదారులు ఆధార్ పొందడంపై CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దేశపౌరులు కానివారికి ఆధార్ ఉంటే ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించింది. ఓటరు జాబితాపై EC చేస్తోన్న SIRను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్. ఇది ఓటు హక్కు, పౌరసత్వం, నివాస స్థలాన్ని ఇవ్వదని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది.

News November 27, 2025

గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ వంటకాలు

image

TG: డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు హైదరాబాద్ బిర్యానీ సహా మరికొన్ని తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. డబుల్‌ కా మీఠా, పత్తర్‌ కా ఘోష్, తెలంగాణ స్నాక్స్ కూడా మెనూలో ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని హైలైట్ చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని CM రేవంత్ ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 27, 2025

మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

image

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్‌లో FIR నమోదైంది.