News March 18, 2025
24 మంది దళితుల హత్య.. ముగ్గురికి మరణశిక్ష

UPలోని దిహులీ నరమేధం కేసులో మెయిన్పురి కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధించింది. 1981 నవంబర్ 18న దిహులీ గ్రామంలోని SC కాలనీలోకి చొరబడిన సాయుధ దుండగుల బృందం పురుషులు, మహిళలు, పిల్లలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 24 మంది మరణించారు. 17 మంది నిందితులపై FIR నమోదవగా, 14 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.
Similar News
News November 12, 2025
రేపు 9AMకి బిగ్ అనౌన్స్మెంట్: లోకేశ్

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను ఆపేసింది. మళ్లీ తుఫాను మాదిరిగా ఏపీకి రాబోతోంది. రేపు ఉ.9 గం.కు పెద్ద ప్రకటన చేస్తాం. రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. మరోవైపు CII పార్ట్నర్షిప్ సమ్మిట్పై లోకేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
News November 12, 2025
సివిల్స్ అభ్యర్థులకు త్వరలో రూ.లక్ష చొప్పున సాయం

TG: సివిల్స్ అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద లబ్ధి పొందిన వారిలో 43 మంది అభ్యర్థులు తాజాగా UPSC సివిల్స్ <<18265046>>ఫలితాల్లో<<>> ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సింగరేణి CSR ప్రోగ్రామ్లో భాగంగా వీరికి CM రేవంత్ త్వరలో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
News November 12, 2025
ఢిల్లీ పేలుడు.. ఆ టెర్రరిస్టుకు మరో కారు?

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో కారు <<18256986>>టెర్రరిస్టుకు <<>>ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకో వాహనాన్ని కూడా ఉపయోగించాడని నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు Ford కంపెనీకి చెందిన EcoSport రెడ్ కలర్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఉమర్ నబీ పేరుతో ఆ కారు(DL10CK0458) ఉన్నట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది.


