News May 25, 2024

వాట్సాప్‌పై మస్క్ విమర్శలు

image

ప్రతి రాత్రి వినియోగదారుల సమాచారాన్ని వాట్సాప్‌ సేకరిస్తోందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఆరోపించారు. కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రకటనల్ని గుప్పించేందుకు ఈ సమాచారాన్ని వాట్సాప్ వాడుకుంటోందని ఓ నెటిజన్ పెట్టిన పోస్టును ఆయన రీట్వీట్ చేశారు. ఆ యాప్ భద్రతతో కూడినదేనని ఇంకా చాలామంది భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వాట్సాప్ మాతృసంస్థ మెటా విధానాల్ని మస్క్ చాలాకాలంగా విమర్శిస్తున్నారు.

Similar News

News February 16, 2025

CT-2025.. భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు

image

భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్‌లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్‌లో, లేకపోతే లాహోర్‌లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న NZతో తలపడనుంది.

News February 16, 2025

ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

image

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.

News February 16, 2025

ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

image

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.

error: Content is protected !!